కాపులకు రిజర్వేషన్లు
ప్రశ్న: కాపులకు రిజర్వేషన్ల అవసరం ఏంటి?
జవాబు:
బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో 1915 నుంచే కాపులకు రిజర్వేషన్లు అమలులో
ఉండేవి. ఆ రోజుల్లో దళితులకు, గిరిజనులకు, మూడో కేటగిరిలో కాపులకు
రిజర్వేషన్లు ఉండేవి.
వాటిని తొలగించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం
ప్రయత్నిస్తే డాక్టర్. బాబా సాహెబ్ అంబేడ్కర్ అడ్డుకున్నారు. వారి కృషి
వల్ల ఆ రిజర్వేషన్లను తొలగించకుండా బ్రిటిష్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తీసివేయాలనుకున్నారు. తీసివేశారు.
ఆ
తర్వాత 1961లో అప్పటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 'కాపులకు గోచీలు
కూడా ఉండవే. వీళ్లు ఓసీలేంటి? వీళ్ల బతుకులు ఓసీ బతుకులా? చాలా కష్టాల్లో
ఉన్నారు' అని అంటూ ఓ జీవో ద్వారా రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరించారు.
అవి 1966 వరకూ కొనసాగాయి.
ఆ తర్వాత పునరుద్ధరించాలని కోరుతూ మా పెద్దలు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. పోరాటాలు చేసి.. రోడ్డు మీదకి వచ్చీ అలసిపోయారు. లాఠీల దెబ్బలు తిన్నాం. బూటు కాళ్లతో తన్నించుకున్నాం. కేసులు పెట్టించుకున్నాం.
Comments
Post a Comment