ఆ రెండు జిల్లాల్లో.. ఇంటెలిజెన్స్ సర్వే అవుట్.. ఆ పార్టీకి దూలతీరిపోతుందట..?
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సర్వేల జోరు సాగుతోంది. ఏపీలో ఎన్నికల సమయం ఆసన్నమవడంతో రోజుకో సర్వే తెరపైకి వచ్చి అక్కడ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఎన్నికల నేపధ్యంలో అధికార ప్రతిపక్షాలు నువ్వా – నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. టీడీపీ, వైసీపీలతో పాటు ఈసారి జనసేన కూడా తన ప్రతాపం చూపించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా విడుదల అయిన రెండు జిల్లాల ఇంటెలిజెన్స్ సర్వే రిజల్ట్స్.. రాజకీయవర్గాల్లో పెద్ద కలకలమే రేపుతుంది. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ విషయానికి వస్తే.. మొదట తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం గట్టిగా ఉంటుందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీకి దెబ్బేసి, టీడీపీని ఓడ్డున చేర్చించి గోదావరి జిల్లాలే అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు గోదావరి జిల్లాల్లో వైసీపీ పుంజుకున్నా.. అలాగే టీడీపీకి కూడా బలమున్నా దాదాపు ఎక్కువ నియోజక వర్గాల్లో జనసేన గెలుపు ఓటములను నిర్ణయించనుందని తెలుస్తోంది. కాకినాడతో పాటు కోనసీమలో