కళ్ల ముందున్న మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. రెండు పార్టీలూ, వాటి నేపథ్యం తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. మూడో పార్టీ జనసేన. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగింది. డబ్బు లేని రాజకీయం చేస్తానని వచ్చింది… అలాగే మాటకు కట్టుబడి ఉంది. అయినా.. జనసేన గురించి సవాలక్ష అనుమానాలు. ట్వట్టరు లేదా సోషల్ మీడియాలో ప్రశ్నలన్నీ పవన్ కళ్యాణ్ గురించే. పవన్ విదేశాలకు వెళుతున్నాడంటగా…? జనసేన ఆఫీసులు మూసేస్తున్నారంటగా..? రెండు సీట్లే వస్తున్నాయంటగా…? మళ్లీ సినిమాలు చేసుకుంటాడంటగా…? 30 సీట్లు వస్తే.. చంద్రబాబుకు మద్దతు ఇస్తాడంటగా..? బుద్ధున్న వాళ్లు ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగరు. లక్షలాది మంది జనం మద్దతు ఉన్నపుడు పవన్ కళ్యాణ్ ఎవరికో ఎందుకు మద్దతు ఇస్తాడు? ‘‘ఎన్నాళ్లు పల్లకీలు మోస్తాం’’ అన్న మాటలో తీవ్రత అర్థం కావడం లేదా? ఇది కూడా అర్థంకానివాళ్లు తగుదునమ్మా అంటూ రాజకీయాలు ఎందుకు మాట్లాడటం? బతుకుల్లో కూడా ఆనందం ఉంది అనుకుంటూ దాని కోసం అక్కడే వెదుక్కునే వాళ్లకు జనసేన పార్టీ అక్కర్లేదు. ఇంకా నమ్మకం లేకపోతే అలెక్సీ హేలీ రాసిన...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత అసలు సిసలైన రాజకీయ పరీక్షని ఎదుర్కోబోతున్నాడు. జనసేన పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్పై ద్రుష్టి పెట్టాడు. జనసేన పార్టీ తపుపున పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన గత కొన్నిరోజులుగా జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం గురించి ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పొటీ చేయబోతున్నారు. ఆ నియోజకవర్గాలు ఇవే: పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం విషయంలో ముందు నుంచి విశాఖ జిల్లా గాజువాక పేరు బలంగా వినిపిస్తోంది. గాజువాక నుంచి పవన్ బరిలో దిగడం ఖరారయింది. గాజువాకతో పాటు భీమవరంలో కూడా పవన్ పోటీ చేయబోతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. తొలిసారి పవన్ ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో సినీ రాజకీయ వర్గాల్లో గాజువాక, భీమవరం గురించి చర్చ మొదలయింది. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్: ఆంధ...
అజేయ సైనికుడు… పవన్ కళ్యాణ్!! ‘‘ఆయన గాయపడిన సింహం… మే 23 ఫలితాలు చూడండి’’ ఈ మాట అన్నది ఎవరో కాదు… ఎంతో పరిణతి ఉన్న ఎస్పీవై రెడ్డిగారు. అవును… పవన్ కళ్యాణ్ గాయపడిన సింహం. సొంత మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆధిపత్య వర్గాలు రెండూ కలిసిపోయి ప్రజారాజ్యం పార్టీని వెన్నుపోటు పొడిచాయి. కమ్మసామాజిక వర్గం చివరి క్షణంలో టిక్కెట్లు అమ్ముకున్నారని ప్రచారం చెయ్యగా, సొంత మనుషులను వలలో వేసుకుని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో కలిపివెయ్యడంలో మరో వర్గం విజయం సాధించింది. పోయిన చోటే మళ్లీ వెదుక్కోవాలి. అది వీరుల లక్షణం. సమాజానికి మేలు చేద్దామని వచ్చిన మెగాస్టార్ చిరంజీవిని అశక్తుడిని చేయడంలో ఈ సమాజం విజయం సాధించింది. అది తాత్కాలికమే… అని నిరూపించదలచుకున్నాడు ఒక తమ్ముడు. పేరు పవన్ కళ్యాణ్. చిరంజీవి తమ్ముడే కదా పవన్ కళ్యాణ్.. ఆ ఆఫ్టరాల్ అనుకున్నారు. కానీ ఆయన మనసులో వెన్నుపోటు రగిలించిన అగ్గి కణకణమంటూ మండుతూనే ఉన్నది. నమ్మిన వారినే అక్కున చేర్చుకున్నాడు. ప్రపంచంలోని రాజకీయ సిద్ధాంతాలన్నీ చదువుకున్నాడు. రాజకీయాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. సలహాల...
Comments
Post a Comment