పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత అసలు సిసలైన రాజకీయ పరీక్షని ఎదుర్కోబోతున్నాడు. జనసేన పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్పై ద్రుష్టి పెట్టాడు. జనసేన పార్టీ తపుపున పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన గత కొన్నిరోజులుగా జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం గురించి ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పొటీ చేయబోతున్నారు. ఆ నియోజకవర్గాలు ఇవే: పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం విషయంలో ముందు నుంచి విశాఖ జిల్లా గాజువాక పేరు బలంగా వినిపిస్తోంది. గాజువాక నుంచి పవన్ బరిలో దిగడం ఖరారయింది. గాజువాకతో పాటు భీమవరంలో కూడా పవన్ పోటీ చేయబోతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. తొలిసారి పవన్ ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో సినీ రాజకీయ వర్గాల్లో గాజువాక, భీమవరం గురించి చర్చ మొదలయింది. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్: ఆంధ...
విజయవాడ: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం తర్వాత ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటి వరకూ తెలుగుదేశం ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఉన్న కాపులు దీనిపై తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. తెరవెనుక కాపు సామాజిక వర్గం మొత్తం.. సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ‘‘మంత్రులతో సహా 25 మంది కాపు నేతల తిరుగుబాటు?’’ శీర్షికతో విజయవాడలోని స్వర్ణాంధ్ర సాయంకాలపు పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. దీనిపై ‘‘న్యూస్ ఆఫ్ 9’’ విచారించగా… అలాంటి వాతావరణం ఉందని, ఇది నిజమేనని తేలింది. ఈ పత్రిక అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నయి. మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు ఎంపీలూ, ఇతర ముఖ్యనాయకులు అంటే మొత్తం 25 మంది కీలకమైన నేతలు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఒక్కొక్కరుగా రావడం కంటే మూకుమ్మడిగా వస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న ఆలోచన కూడా సాగుతోంది. వీరిలో చాలా మంది ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతున్నారని, ఆయనకు సానుకూలంగా స్పందించారని చ...
అవినీతిపరులు… చింతకాయల్లా రాలిపోతారు తెలుగుదేశం, జగన్ పార్టీలు డొల్ల పార్టీలే.. ధర్మాన్ని రక్షించడానికే జనసేన అవతరణ తిట్లపై ఛానెళ్లు చర్చలు పెట్టడమేమిటి? వేల, లక్షల కోట్లున్న చంద్రబాబు, జగన్ పార్టీలను మీరు ఎలా ఎదుర్కొంటారంటూ తనను అనేక మంది ప్రశ్నించిన అంశాన్ని గుర్తు చేస్తూ… ‘‘ఒక కోడి గుడ్డును పగల గొట్టడానికి గుండ్రాయితో పనేంటి?’’ అని ఒక్క సామెతతో ప్రజలకు ధైర్యాన్ని నూరిపోశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. కొల్లాయిగుడ్డ కట్టుకున్న ఒక బక్కపలచని వ్యక్తి రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించగా లేనిదీ… అవినీతిమయం అయిపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చలేమా అంటూ ప్రశ్నించారు.పోరాటయాత్రలో ఆయన మాట్లాడుతూ… ‘‘2019లో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు నాతో ఉండండి. తెలుగుదేశం, వైఎస్సార్సీపీ కోటలు బద్దలు కొడదాం. మార్పు జరుగుతున్న క్రమంలో అది ఎవరికీ కనిపించదు. వచ్చిన తర్వాత మాత్రమే కనిపిస్తుంది. మార్పు తెద్దాం. ...
Comments
Post a Comment