తెలంగాణలోని కొన్ని ఉత్కంఠభరిత పరిస్థితుల్లో ఎన్నికలు ఎట్టకేలకు ముగిసిపోయాయి.అయితే ఎక్కడైనా ఎన్నికల ముందు ఒకరి పార్టీల మీద ఒకరు వారి యొక్క బలాబలగాలను తెలుసుకునేందుకు సర్వేలు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో సర్వేలు చేయించుకుంటారని అందరికి తెలుసు.అయితే తెలంగాణలో జాతీయ సర్వేల్లో వచ్చిన ఫలితాల దగ్గర ప్రాంతీయ నేతలు చేయించిన సర్వేలు తేలిపోయాయి.కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల దగ్గరకి వచ్చింది.ఇంకా కొన్ని నెలలు మాత్రమే గడువు మిగిలి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి పార్టీలు వారి పార్టీని ప్రజల్లో నిలిపిందేకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎలా చూసుకున్నా మూడు ముఖ్య పార్టీలే ప్రజలకు కనిపిస్తున్నాయి.దానికి తోడు “జనసేన” పార్టీ మీదనే అందరి కళ్ళు ఉన్నాయి.పవన్ కు ఎలాగో ప్రజాధరణ ఎక్కువే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం పవన్ చాలా బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ లో మారుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు పవన్ ని...
రూ.2 లక్షల చొప్పున పరిహారం అనంతపురం: అనంతపురం కవాతుకు హాజరై తిరిగి ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పార్టీ కార్యకర్తలకు సోమవారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన సంతాప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికీ రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే అంత్యక్రియలకు అయ్యే ఖర్చులను పార్టీ భరిస్తుందని తెలిపారు. తాను ఎప్పుడూ ఇలాంటివి జరుగుతాయని భయపడే.. జాగ్రత్తలు చెబుతుంటానని అన్నారు. ‘‘నేను వచ్చిందే మీ భవిష్యత్తు కోసం.. నిండు నూరేళ్లూ జీవించాల్సిన వాళ్లు ఇలా అయిపోవడం బాధిస్తోంది. ఇకనైనా అందరూ జాగ్రత్తగా ఉండాలి’’ అని పవన్ హితవు పలికారు. అనంతపురం కవాతును విజయవంతం చేసిన అందరికీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. బలితీసుకున్న బస్సు కవాతు నుంచి తిరిగొస్తున్న నలుగురు జనసేన కార్యకర్తలు కారులో ఇళ్లకు బయల్దేరారు. డోన్ సమీపంలో వేగంగా వస్తున్న ఒక ప్రైవేటు బస్సు వచ్చి వీళ్లు ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. నలుగురూ అక్కడికక్కడే చనిపోగా, కారు డ్రైవర్ మాత్రం ఆస్పత్రిలో...
40 ఏళ్లుగా వైద్యసేవలు ప్రజల కన్నీటి నివాళి చెన్నై , టీ.నగర్: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేవలం ఐదు రూపాయలకే వైద్య చికిత్సలందిస్తూ వచ్చిన డాక్టర్ జయచంద్రన్ (71) బుధవారం కన్నుమూశారు. చెన్నై వాషర్మెన్పేటలో డాక్టర్ జయచంద్రన్ అంటే ఎవరికీ తెలియదు. ఐదు రూపాయల డాక్టర్ అంటే ప్రజలందరికీ సుపరిచితులు. ఆ స్థాయికి ప్రజల మన్ననలందుకున్న డాక్టర్ జయచంద్రన్ అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన మృతదేహాన్ని ఓల్డ్ వాషర్మెన్పేట వెంకటేశన్ వీధిలోగల ఆయన స్వగృహంలో ఉంచారు. ఆయన కుమార్తె శరణ్య స్థానిక స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నారు. కుమారుడు శరత్ ఓమందూరర్ ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యునిగాను, మరో కుమారుడు శరవణన్ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నారు. జయచంద్రన్ భార్య డాక్టర్ వేణి ప్రసూతి వైద్య నిపుణురాలు. చెన్నై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డీన్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. మొత్తం కుటుంబం వైద్య రంగంలో పేరు గడించింది. వైద్యం వృత...
Comments
Post a Comment