40 ఏళ్లుగా వైద్యసేవలు ప్రజల కన్నీటి నివాళి చెన్నై , టీ.నగర్: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేవలం ఐదు రూపాయలకే వైద్య చికిత్సలందిస్తూ వచ్చిన డాక్టర్ జయచంద్రన్ (71) బుధవారం కన్నుమూశారు. చెన్నై వాషర్మెన్పేటలో డాక్టర్ జయచంద్రన్ అంటే ఎవరికీ తెలియదు. ఐదు రూపాయల డాక్టర్ అంటే ప్రజలందరికీ సుపరిచితులు. ఆ స్థాయికి ప్రజల మన్ననలందుకున్న డాక్టర్ జయచంద్రన్ అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన మృతదేహాన్ని ఓల్డ్ వాషర్మెన్పేట వెంకటేశన్ వీధిలోగల ఆయన స్వగృహంలో ఉంచారు. ఆయన కుమార్తె శరణ్య స్థానిక స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నారు. కుమారుడు శరత్ ఓమందూరర్ ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యునిగాను, మరో కుమారుడు శరవణన్ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నారు. జయచంద్రన్ భార్య డాక్టర్ వేణి ప్రసూతి వైద్య నిపుణురాలు. చెన్నై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డీన్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. మొత్తం కుటుంబం వైద్య రంగంలో పేరు గడించింది. వైద్యం వృత...
కళ్ల ముందున్న మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. రెండు పార్టీలూ, వాటి నేపథ్యం తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. మూడో పార్టీ జనసేన. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగింది. డబ్బు లేని రాజకీయం చేస్తానని వచ్చింది… అలాగే మాటకు కట్టుబడి ఉంది. అయినా.. జనసేన గురించి సవాలక్ష అనుమానాలు. ట్వట్టరు లేదా సోషల్ మీడియాలో ప్రశ్నలన్నీ పవన్ కళ్యాణ్ గురించే. పవన్ విదేశాలకు వెళుతున్నాడంటగా…? జనసేన ఆఫీసులు మూసేస్తున్నారంటగా..? రెండు సీట్లే వస్తున్నాయంటగా…? మళ్లీ సినిమాలు చేసుకుంటాడంటగా…? 30 సీట్లు వస్తే.. చంద్రబాబుకు మద్దతు ఇస్తాడంటగా..? బుద్ధున్న వాళ్లు ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగరు. లక్షలాది మంది జనం మద్దతు ఉన్నపుడు పవన్ కళ్యాణ్ ఎవరికో ఎందుకు మద్దతు ఇస్తాడు? ‘‘ఎన్నాళ్లు పల్లకీలు మోస్తాం’’ అన్న మాటలో తీవ్రత అర్థం కావడం లేదా? ఇది కూడా అర్థంకానివాళ్లు తగుదునమ్మా అంటూ రాజకీయాలు ఎందుకు మాట్లాడటం? బతుకుల్లో కూడా ఆనందం ఉంది అనుకుంటూ దాని కోసం అక్కడే వెదుక్కునే వాళ్లకు జనసేన పార్టీ అక్కర్లేదు. ఇంకా నమ్మకం లేకపోతే అలెక్సీ హేలీ రాసిన...
రూ.2 లక్షల చొప్పున పరిహారం అనంతపురం: అనంతపురం కవాతుకు హాజరై తిరిగి ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పార్టీ కార్యకర్తలకు సోమవారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన సంతాప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికీ రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే అంత్యక్రియలకు అయ్యే ఖర్చులను పార్టీ భరిస్తుందని తెలిపారు. తాను ఎప్పుడూ ఇలాంటివి జరుగుతాయని భయపడే.. జాగ్రత్తలు చెబుతుంటానని అన్నారు. ‘‘నేను వచ్చిందే మీ భవిష్యత్తు కోసం.. నిండు నూరేళ్లూ జీవించాల్సిన వాళ్లు ఇలా అయిపోవడం బాధిస్తోంది. ఇకనైనా అందరూ జాగ్రత్తగా ఉండాలి’’ అని పవన్ హితవు పలికారు. అనంతపురం కవాతును విజయవంతం చేసిన అందరికీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. బలితీసుకున్న బస్సు కవాతు నుంచి తిరిగొస్తున్న నలుగురు జనసేన కార్యకర్తలు కారులో ఇళ్లకు బయల్దేరారు. డోన్ సమీపంలో వేగంగా వస్తున్న ఒక ప్రైవేటు బస్సు వచ్చి వీళ్లు ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. నలుగురూ అక్కడికక్కడే చనిపోగా, కారు డ్రైవర్ మాత్రం ఆస్పత్రిలో...
Comments
Post a Comment