ఊరును బాగు చేస్తామన్నారు అందరికీ మంచి నీళ్లు ఇస్తామన్నారు అందరికీ ఇళ్లు కూడా కట్టిస్తామన్నారు సంతకాలయిన తర్వాత ముఖం చాటేశారు మా దగ్గరే కూలీ చేసుకోమన్నారు… నామ్ కే వాస్తేగా ఒక రీచ్ లో లైసెన్సు రద్దు చేసిన ప్రభుత్వం ఆ రద్దు కూడా గ్రామస్థుల ఆగ్రహాన్ని తగ్గించేందుకే తరలిపోయిన కోట్లాది రూపాయలు.. గ్రామస్థుల నోట్లో మట్టి కొట్టిన ఆండ్రూస్… అవినీతిని వెలికితీయాలంటే… చిత్తశుద్ధిగల ప్రభుత్వమైనా ఉండాలి… లేదంటే చిత్తశుద్ధి గల మీడియా సంస్థ అయినా ఉండాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా.. చిత్తశుద్ధిగల ప్రభుత్వం నేతిబీర చందం. ఇక మీడియా సంస్థల గురించి తెలిసిందే. చంద్రబాబు, లోకేష్ బాబులు ఎన్ని దొంగ వార్తలు రాయించుకున్నా… నిజాలను ఆపలేరు. మీడియా సంస్థలు పట్టించుకోవడం లేదు కాబట్టే… జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా వంతాడ గ్రామానికి వెళ్లి లాటిరైటు గనుల్ని పరిశీలించాల్సి వచ్చింది. అసలు వాస్తవాలు ఇవిగో…! 360 డిగ్రీల్లో సాగిన దోపిడీ..!! ...
Comments
Post a Comment