పొత్తుకు ఒప్పుకోలేదనా లేక దారికిరాలేదానా జనసేన ఆఫీస్ పై ఈ దాడులా..బాబు ??
గత కొంత కాలం క్రితం తెలుగుదేశం పార్టీ నేతలు పవన్ తో పొత్తులు కోసం
వెంపర్లాడిన సంగతి తెలిసిందే.కానీ పవన్ మాత్రం వామపక్షాలతో తప్ప వేరే
ఎవరితోనూ కలిసేది లేదు అంటూ ఖరాఖండీగా మొన్న గుంటూరులో జరిగినటువంటి భారీ
బహిరంగ సభలో చెప్పేసారు.అంతకు మునుపు వరకు పవన్ పై మరియు జనసేన పార్టీపై
తీవ్ర ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు చేసేవారు కానీ ఆ తర్వాత సడెన్
గా ఆపేసరికి పలు అనుమానాలు వచ్చాయి.
సరిగ్గా అప్పటి నుంచే వారు పవన్ ను మెల్లగా దువ్వడం మొదలు పెట్టారు.కానీ
పవన్ దగ్గర మారి జిమ్మిక్కులు ఏమి పని చేయకపోవడంతో ఇప్పుడు ప్రతీకారం
తీర్చుకుంటున్నారా అని విశ్లేషకులు తెలుపుతున్నారు.పవన్ బాబుతో పొత్తుకు
ఒప్పుకుంటే ఒకలాగా లేకపోతే మరోలా తెలుగుదేశం క్యాడర్ పవన్ ను
చిత్రీకరిస్తారని రాజకీయ విశ్లేషకులు చెప్పకనే చెప్పారు.ఇప్పుడు సరిగ్గా
అలాగే జరిగింది.
పవన్ వారితో పొత్తు పెట్టుకునేది లేదు అని చెప్పినందుకే కొత్తగా ఏర్పాటు
చేసిన జనసేన కార్యాలయంపై బీరు బాటిళ్లతో దాడికి పాల్పడ్డారని జనసేన పార్టీ
అభిమానులు చెప్తున్నారు.వారికి మద్దతివ్వకపోతే ఇలా చెయ్యడం ఒక పిరికిపందల
చర్యగా మేము భావిస్తామని వారు తెలుపుతున్నారు.ఈ దాడికి పాల్పడిన ఎవరిని
వదిలిపెట్టేది లేదు అని చట్టపరంగా వారికి శిక్ష పడేలా చేస్తామని జనసేన
పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు.
Comments
Post a Comment