నాగబాబు ఉన్న మాటేగా చెప్పారు…!!

 Nothing wrong in Nagababu words on Paid Batch | telugu.newsof9.com



        గాజువాక జనసేన ఆత్మీయ సమావేశంలో నరసాపురం పార్లమెంటు అభ్యర్థి నాగబాబు మాట్లాడిన మాటల్లో తప్పేం ఉంది? ఆయనేదో బూతు మాటలు మాట్లాడినట్లు ‘‘సాక్షి’’ దినపత్రిక బుగ్గలు నొక్కుకుంటున్నది గానీ… నాగబాబు అక్షరాలా ఉన్నమాటే చెప్పారు. అయిన దానికీ కానిదానికీ విలేకరుల సమావేశాలు పెట్టి… ఇతరులపై నోరు పారేసుకోవడం మెగా బ్రదర్స్ ఇంటావంటా లేని అలవాటు. 

   అయితే ఎంతసేపూ ఇతరులపై బురద చల్లేందుకే విలేకరుల సమావేశాలు పెట్టే ఛోటామోటా ఆర్టిస్టులను వెధవలు అంటూ తిట్టడం తప్పెలా అవుతుంది? అనవసరంగా మెగా బ్రదర్స్ పై నోరుపారేసుకోవడం అందరికీ గొప్పగా కనిపించినపుడు ‘‘మీరు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు’’ అంటూ కాస్త ఘాటుగా చెప్పడం సరైనది కాకుండా ఎలా పోతుంది?

మెగా బ్రదర్స్ మాట్లాడితే… ఆ మాటలకు ఎంత వైడ్ పబ్లిసిటీ వస్తుందో అందరికీ తెలిసిందే. అయినా తమకు ఉన్న ప్రజాభిమానాన్ని దుర్వినియోగం చేయకుండా మెగా బ్రదర్స్ తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. వారికై వారు విలేకరుల సమావేశం నిర్వహించి ఫలానా వారిపై దుమ్మెత్తి పోశారని ఒక్క ఉదాహరణను ‘‘సాక్షి’’ దినపత్రిక చూపించగలదా?

 నిన్న వైసీపీ నేత ఒకరు మాట్లాడుతూ… ‘‘లోకేష్ కీ, యామినీకి ఉన్న సంబంధం ఏమిటి?’’ ద్వంద్వార్థం వచ్చేలా మాట్లాడటం వైసీపీ నేతలకే చెల్లింది. నోరు తెరిస్తే… కంపు అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో  మాట్లాడుతున్నది ఎవరు? మెత్తగా ఉన్నారని… నోటిని డ్రైనేజీగా వాడుతున్నది ఎవరు అన్నది వారికి వారు ప్రశ్నించుకోవాల్సిన అంశం.

మెగాబ్రదర్స్ ను ప్రాణప్రదంగా అభిమానులు కాపాడుకోవడానికి కారణం… వారి వ్యక్తిత్వమే అన్న విషయాన్ని సభ్య సమాజం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎన్ని అపవాదులు వేసినా పవన్ కళ్యాణ్ ఒక్క మాట మాట్లాడటంలేదంటే అది ఆయన వ్యక్తిత్వం. 

     ఎన్నికల ఫలితాలు రాకముందే… జనసేన పార్టీ ఓడిపోయిందని రాస్తున్న తింగరి రాతలు ఎందుకు రాస్తున్నారు? ఎవరో ఒక వ్యక్తి వెళ్లిపోయినంత మాత్రాన జనసేన పార్టీకి నష్టం వస్తుందనుకోవడం అవివేకం. అలా అనుకుంటే తెలుగుదేశం, వైసీపీ పార్టీల నుంచి అటూ ఇటూ వందల సంఖ్యలో నేతలు వెళ్లిపోయారు. అడ్డదారుల్లో కోట్లాది రూపాయలు సంపాదించి పార్టీలను నిర్వహిస్తున్న వారికి ఏమీ కాదులే అన్న గుడ్డి నమ్మకం మీ అడ్డగోలు రాతల్లో కనిపిస్తోంది. 

    జనసేన తరగని ధనరాసి- జన సైనికులు. వారు ఉన్నంత వరకూ, పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకూ ఎవరు వెళ్లిపోయినా జనసేన పార్టీ అజరామరం. జన సేనాని గుండె ఘోష జన సైనికులకు తెలుసు. పెయిడ్ బ్యాచ్ గురించి నాగబాబు ఉపయోగించిన పదజాలంపై రాజకీయ నాయకులు ఆశ్చర్యపోతున్నట్లుగా సాక్షి దినపత్రిక రాయడం విడ్డూరంగా ఉంది.

 జనసేనపై సాక్షి దినపత్రిక ఎన్ని అబద్ధాలు రాసిందీ ప్రజలకు తెలుసు. ఎవరికి వారు తామే గొప్ప అంటూ జబ్బలు చరుచుకుంటున్నా… ఎవరు ఏమిటి అన్నది ప్రజలకు మహా బాగా తెలుసు. మే 23న అందరి మాస్కులూ తొలగిపోతాయి. కాస్త ఆగండి!!

Comments

Popular posts from this blog